నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ప్రభుత్వం చేపట్టిన “మన ఇసుక – మన వాహనం” పథకం ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని మండల తహసీల్దార్ విట్టల్ తెలిపారు.
ప్రజలు ప్రభుత్వ యాప్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకుని ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి నెలలో బుకింగ్ చేసుకున్న వారికి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో ఇసుక సరఫరా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
ఈ పథకం ద్వారా మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే, సమయానికి ఇసుకను తమ ఇళ్ల వద్దకు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
అదే విధంగా, ఎలాంటి అవకతవకలు గమనించినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
“ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సేవను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి” అని తహసీల్దార్ విట్టల్ పిలుపునిచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








