
ఖురానా ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్..
ఎన్హెచ్–44 రహదారిపై భద్రతా చర్యలు బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు నిజామాబాద్, మార్చి 16: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు ఇటీవల జరిగిన ఖురానా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మార్చి 13వ తేదీ తెల్లవారుజామున ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ శివారులో జాతీయ రహదారి–44పై జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం




































