
మిస్టర్ పర్ఫెక్ట్ అధికారిగా అరుదైన గుర్తింపు – ప్రజల మనసులు గెలుచుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్
నేటి కాలంలో అధికార వ్యవస్థపై ప్రజలకు అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉండటం సహజం. అయితే, అటువంటి పరిస్థితుల్లోనూ తన నిష్ఠ, నిజాయితీ, కర్తవ్యపరమైన సేవలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అరుదైన అధికారిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్ నిలిచారు. ప్రజలు ప్రేమతో “మిస్టర్ పర్ఫెక్ట్” అని పిలుచుకునే ఈ అధికారి సేవలు నిజంగా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తూ




































