బైంసా పట్టణంలో మున్సిపల్ వాహనాలను, శానిటైజేషన్ కార్మికులను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం ప్రజలలో ఆగ్రహం రేపుతోంది. అయూబ్ ఖాన్ అనే వ్యక్తి తన ప్లాట్లో బిల్డింగ్ కూల్చిన మెటీరియల్ను మున్సిపల్ ట్రాక్టర్ ద్వారా ఎత్తివేయించడం తారాస్థాయికి చేరింది.

ప్రజా సేవకు వినియోగించాల్సిన వనరులను ఇలా ఒక్కరికి వ్యక్తిగత ప్రయోజనం కోసం వినియోగించడం అంటే ప్రజల వెక్కిరింపే!
మరోవైపు, వార్డు నెంబర్ 7లోని రాహుల్ నగర్ ప్రజలు డ్రైనేజీ సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఒక నెల నుంచి డ్రైనేజీ తొలగించిన తర్వాత కూడ చెత్తను లేపకపోవడం వల్ల మురికి రోడ్లపై నిలిచిపోతుంది. ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా జెసిబి తెచ్చి చెత్త తీసిపారేయడం మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.

ఈ విషయంపై బైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే గారు ఘాటుగా స్పందించారు. ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేసి వ్యక్తిగత సేవలకే వనరులను ఉపయోగించడం అధికారుల బదిలీ లાયક తప్పిదమని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....