నిజామాబాద్ – జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జే. గోవిందరావు గారి కుమారుడు శ్రీ జే. సాయి చైతన్య గారు UPSC పరీక్షలో 68వ ర్యాంకు సాధించి IAS అర్హత పొందారు.
ఈ సందర్భంగా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య గారు, జే. సాయి చైతన్య గారిని వారి విద్యాభ్యాసంలో ఈ అద్భుతం సాధించినందుకు శాలువా తో సత్కరించారు.
పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ, “పోలీస్ సిబ్బంది 24 గంటలు సేవలందిస్తూ తమ పిల్లలను మంచి చదువులకు ప్రోత్సహించడం మన సంస్కృతి” అని పేర్కొన్నారు.

అంతే కాకుండా, ఈ విజయం ఇతర పోలీసు సిబ్బందికి ఉత్తమమైన మార్గదర్శకంగా నిలిచేందుకు మనోహరమైన సందేశమని, భవిష్యత్తులో అందరూ తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే సూచన చేశారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








