May 15, 2026 10:51 pm

V1News Telangana

గోవిందరావు పటేల్ ఆయన అనుచరులు కావాలని అరాచకాలు సృష్టిస్తున్నారు ఓటమిని జీర్ణించుకోలేకనే గ్రామంలో అశాంతిత వాతావరణ నెలకొల్పుతున్నారు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గోవిందరావు పటేల్ ఆయన అనుచరులు కావాలని అరాచకాలు సృష్టిస్తున్నారు

ఓటమిని జీర్ణించుకోలేకనే గ్రామంలో అశాంతిత వాతావరణ నెలకొల్పుతున్నారు

గ్రామపంచాయతీ కార్యాలయంలో కుర్చీ మీద కూర్చుని వివక్ష చూపుతూ ప్రజలపై దొరైజం చూపించారు

అదేమిటని ప్రశ్నించినచో దాడులు చేశారు
ఒకరి మెడలో బంగారం పోయింది చెయ్యి ఫ్రాక్చర్ అయింది

ఏళ్ల నుంచి గ్రామంలో పెత్తనం చెలాయించాడు గోవిందరావు పటేల్ ఇకపై చాలా ఇస్తామంటే మేము ఊరుకోం

గోవిందరావు పటేల్ దొర పాలనకు స్వస్తి చెబుతాం
ప్రజాస్వామ్యంలో మీ అరాచకాలు ఏమిటి
మీ పెత్తనం ఏమిటి అని తిరగబడ్డ జనం

రాయికూరు
రుద్రూరు

తమ గ్రామంలో ఏళ్ల నుంచి అరాచకాలు సృష్టిస్తూ దొరపాలనకు అలవాటు పడి, పెత్తనం చెలాయిస్తున్న గోవిందరావు పటేల్ ఓటమిని జీవించుకోలేకనే గ్రామంలో ఆ శాంతియుత వాతావరణం నెలకొల్పుతున్నారని, గెలిచిన వారిపై రౌడీ ఇజం, గుండాయిజం చలాయిస్తూ ఏదో ఒక సాకుతో గొడవలు చేస్తూ, అశాంతిత వాతావరణ రాయకూరు గ్రామంలో నెలకొల్పుతున్నారు అంటూ గ్రామ సర్పంచ్ పెంట గంగమ్మ శ్రీవారు గంగారం అదేవిధంగా ,ఉపసర్పంచ్ తాడ్కొల్ అర్చన శ్రీవారు అనిల్ పటేల్, నరేష్, కురుమ గంగారం తోపాటు పాలకవర్గం ,ప్రజలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయ్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫస్ట్ సారి జరిగిన గ్రామసభలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, ఈ ఘర్షణ తారస్థాయికి చేరుకొని ఒకరిపై ఒకరు రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు, ఈ సందర్భంగా గెలిచినా పాలకవర్గం వారు మాట్లాడుతూ గ్రామంలో గ్రామ సభ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభం అయిందని గ్రామస్తులు హాజరై గ్రామ సభ మొదలయ్యే సమయంలో ప్రజలందరికీ ఇబ్బంది కలకుండా పట్టాలు వేసి కింద కూర్చుండబెట్టి సమావేశం ప్రారంభానికి సన్నద్ధం అయిన తరుణంలో, గోవిందరావు పటేల్ ఆయన అనుచరులు వచ్చి కుర్చీ మీద కూర్చోవడం జరిగిందని అన్నారు, కొంతమంది ప్రజలు కింద కూర్చుని ఉండగా వారు కుర్చీలో కూర్చుండడం సరిగా ఉండబోదని గ్రామ పౌరులు కురుమ గంగారం తో పాటు నరేష్ ఇతర వ్యక్తులు గ్రామ ప్రజలు కింద కూర్చున్నారని, మీరు కుర్చీలో కూర్చుంటే ప్రజలకు అవమానం జరుగుతుందని అందరితోపాటు కింద కూర్చొని ఉంటే ప్రజలకు గౌరవం ఇచ్చినట్టు అవుతుందని అనడంతో, ఈ విషయాన్ని జీవించుకోలేక గోవిందరావు పటేల్ ఆయన అనుచరులు నరేష్ తో పాటు కురుమ గంగారం పై దాడి చేశారని అడ్డొచ్చిన ప్రతి ఒక్కరి మై రౌడీయిజం చేస్తూ దాడులకు యత్నం చేశారని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకో లేకనే తమపై కావాలని ఏదో ఒక కుంటి సాకులు చెబుతూ వివక్ష చూపుతున్నారని కక్ష సాధింపులు భాగంగా కావాలని రాద్ధాంతం చేస్తూ గ్రామంలో అశాంతిత వాతావరణం నెలకొల్పుతున్నారని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి దశలో కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే అభివృద్ధిని అడ్డుకుంటూ ఆటంకంగా మారుతున్నారని ప్రజలకు అన్యాయం చేయడంలో కారకులు అవుతున్నారని అన్నారు. మొట్టమొదటిసారిగా జరిగే గ్రామసభను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని వారు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిసారి ఏదో ఒక సాకుతో గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. వారు చేసిన దాడిలో నరేష్ అనే వ్యక్తి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని ఆయన మెడలో ఉన్న బంగారం పోయిందని తెలిపారు. గెలిచిన పాలకవర్గం తో పాటు మాకు మద్దతుగా ఉన్న వారిపై వివక్ష చూపడమే కాకుండా కక్ష సాధింపులు చేస్తూ రౌడీయిజం చేస్తూ తమకు బతకనీయకుండా హరాస్మెంట్ చేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం కావాలంటూ రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినమని అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవోకు సమస్యను విన్నవించి ఎంపిడిఓ కు కలిసి సమస్యను విన్నవించడం జరిగిందని అనంతరం గ్రామసభలో గ్రామ ప్రజలకు ఆటంకం కల్పించే విధంగా గ్రామసభను అడ్డుకుని గొడవలు సృష్టించిన గోవిందరావు పటేల్ ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని నిరసన చేసినట్లు తెలిపారు. వారి వల్ల మాకు ప్రాణహాని ఉందని మాకు రక్షణ కావాలని తెలిపారు. గ్రామ పాలన సరిగా కొనసాగనీయకుండా గ్రామ అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని గ్రామానికి, ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more