సాలూర, మే 15 (వార్త):
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి శ్రీమతి పద్మజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. అలాగే 6, 7, 9 తరగతుల్లో క్లాస్ ఫస్ట్ సాధించిన విద్యార్థులతో పాటు అధిక హాజరు శాతం నమోదు చేసిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా ప్రత్యేక అధికారి పద్మజ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు మెరుగైన జ్ఞానాన్ని పొందుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాజీవ్ మంజూష మాట్లాడుతూ, పాఠశాలలో డిజిటల్ బోధన, కంప్యూటర్ ల్యాబ్, ఐఎఫ్బీ ప్యానెల్స్, అగ్రి వొకేషనల్ మరియు ఐటీ వొకేషనల్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు విజయ్ కుమార్, సుధారాణి, స్వామి, అబ్బయ్య, సాయిలు, సంగీతరావు, సంతోష్ యాదవ్, రాజకుమార్, లక్ష్మి, విజయలక్ష్మి, జ్యోత్స్న, వనజ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








