బోధన్లో వాహనాల తనిఖీలు: ఇద్దరు అరెస్ట్.. ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..
బోధన్, జూలై 14 (వి1 న్యూస్):
బోధన్ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో వారు బీటీ నగర్కు చెందిన వసీం, ఆటోనగర్కు చెందిన జావీద్గా గుర్తించారు. వారి వద్ద నుంచి మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్కు తరలించారు.

ఈ కేసులో వాహనాల రికవరీకి విశేషంగా కృషి చేసిన ఏఎస్ఐ బాబురావు, పోలీసు కానిస్టేబుళ్లు గంగారాం, శివకృష్ణలను పోలీస్ కమిషనర్ అభినందించారు. వారి సేవలను గుర్తించి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ వివరాలను బోధన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వెల్లడించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









