వార్త:
నిజామాబాద్: అడ్డమీది కూలి డబ్బుల విషయంలో జరిగిన వివాదం రెండు ప్రాణాలను బలి తీసుకున్న ఘటనలో నిందితునికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
డిచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 ఆగస్టు 14న మండల కేంద్రంలో మామ, అల్లుడు, బామ్మర్ది ముగ్గురు కలిసి పని నిమిత్తం వెళ్లారు. అదే రోజు సాయంత్రం కూలి డబ్బుల పంచకం విషయంలో వివాదం తలెత్తడంతో, నిందితుడు అక్కడే ఉన్న కత్తిని పదును చేసి, చాకు సహాయంతో మామ మరియు బామ్మర్దిని అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు.
ఈ కేసును అప్పట్లో సీఐ రఘునాథ్ విచారించగా, అనంతరం ప్రస్తుత సీఐ వినోద్ రెడ్డి కేసును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. నిందితుడు కర్ణాటక రాష్ట్రంలో దాగి ఉండగా అతని ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేసి జిల్లా జైలుకు తరలించారు. తదుపరి కోర్టులో హాజరు పరుస్తూ కేసు విచారణను వేగవంతం చేశారు.
ఈ కేసుకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీమతి జి.వి.ఎన్ భారత లక్ష్మి నిందితునికి జీవిత ఖైదుతో పాటు రూ.2000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.
నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్, సీఐ వినోద్ రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై గోవింద్, హెడ్ కానిస్టేబుల్ కిషన్ తదితరులను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






