V1News Telangana

best news portal development company in india

హైవేపై వడ్లు ఆరబెట్టడంలో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్సై మచ్చేందర్ రెడ్డి హెచ్చరిక

Picture of V1News Telangana.& Hindi & Mharti.

V1News Telangana.& Hindi & Mharti.

SHARE:

సాయంత్రం తర్వాత కుప్పలు ప్రమాదకరం – రేడియం కోన్స్ తప్పనిసరి.
👉 హైవేపై వడ్లు ఆరబెట్టడంపై ఎస్సై హెచ్చరిక
👉 రాత్రివేళల్లో ప్రమాదాలు నివారించండి: రైతులకు సూచనలు
👉 రేడియం కోన్స్ తప్పనిసరి –  ఎస్సై మచేందర్ రెడ్డి
👉 నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు: పోలీసుల హెచ్చరిక
👉 వడ్ల కుప్పలతో ప్రమాదాలకు చెక్ – గ్రామ సభలో అవగాహన

సాలూర మండలం గ్రామ సభలో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. వడ్ల సీజన్ సందర్భంగా హైవే రోడ్లపై వడ్లు ఆరబెట్టే సమయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
సాయంత్రం 5 గంటల తర్వాత హైవే రోడ్లపై వడ్ల కుప్పలు ఉంచడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు ఈ కుప్పలను గమనించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అలాంటి ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వడ్ల కుప్ప ముందు, వెనుక రేడియం కోన్స్ లేదా హెచ్చరిక సూచనలు ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు. ఇతరుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పక్షంలో ప్రమాదం జరిగి ప్రాణనష్టం కలిగితే, సంబంధిత వడ్ల కుప్ప యజమానిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై మచ్చేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
గ్రామస్థులు, రైతులు పోలీసుల సూచనలు పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india
best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई