Post Views: 59
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.ఈ నెల 27 వ తేదీన జరగనున్న ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.అనంతరం ఓటర్ లకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు పృథ్వి,అశోక్,మేఘనాథ్, మదన్,పవన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..