V1News Telangana

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు….

– పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిని గుర్తు చేసినందుకు కవితకు ధన్యవాదాలు

– అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధినిధులు ఇచ్చి ఉంటే చాలామంది ఎమ్మెల్యేలు గెలిచేవారని ఎద్దేవా

– కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను కెసిఆర్ తెచ్చినట్లు చెప్పుకోలేదా అని సూటి ప్రశ్నలు

– పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకలిని భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు

– నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు

– తమ ఆరాధ్య నాయకుడిపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం రోజు బాన్సువాడ పర్యటనలో మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం రోజు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి మరియు కాలేక్ మాట్లాడుతూ కవిత పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధినిధులు ఇచ్చేవారు ఇచ్చినప్పటికీ ఆయన కష్టపడి, కొట్లాడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎలాగైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం కెసిఆర్ అని గొప్పలు చెప్పుకుంటున్నారో ఇది కూడా అంతే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి రాని నిధులు బాన్సువాడకు వచ్చిన మాట ముమ్మాటికి నిజం అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్పీకర్ గా పనిచేసినవారు ఓడిపోతారన్న చరిత్రను తిరగ రాయడానికి కారణం.. బాన్సువాడలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అని సూచించారు. ఆయన అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధిలో పాటుపడ్డారని గుర్తు చేశారు. బాన్సువాడ నియోజకవర్గం మాదిరిగా అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధినిధులు సమకూర్చి ఉంటే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు గెలిచేవారని చురకలు అంటించారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా కేసీఆర్ నిధులు ఇచ్చిన విషయాన్ని అనేక సందర్భాలలో, బహిరంగ సభలలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని తెలిపారు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే గుణం ఆయనది కాదని అన్నారు. ఆయన ఆకలిని అయిన భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించరని .. వారిది చాలా సున్నితమైన మనస్తత్వం అని తెలిపారు. తనకు అవమానం జరిగిన, ఇతరులకు అవమానం జరిగిన ఆయన ఒకే రీతిలో స్పందిస్తారని గుర్తు చేశారు. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకొని నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ యధావిధిగా కొనసాగిస్తూ విధులను కొత్త పనులకు సమకూర్చుతున్నారని అన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జాకోర లిఫ్ట్ ఇరిగేషన్ మరియు చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్, బాన్సువాడలో వంద పడకల ఆసుపత్రి, వర్ని ఆసుపత్రి, కోటగిరి ఆసుపత్రి, చందూర్ ఆసుపత్రి , ఎస్టి రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కాలేజ్ యధావిధిగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని.. అదేవిధంగా బాన్సువాడ ప్రసూతి ఆసుపత్రిలో సేవలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని తిప్పి కొట్టారు. బాన్స్వాడలో మంచినీటి సరఫరా పనులకు శంకుస్థాపన మరియు రూ.300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మరియు బోర్లం సబ్ స్టేషన్ మంజూరు త్వరలో కాబోతున్నాయని తెలిపారు. గతంలో పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుందని.. డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ బిల్లులు రూ.15 కోట్లు ఇప్పించడం జరిగినదని వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన విధంగా బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల కోట్లు నిధులు అభివృద్ధి కొరకు మరియు సంక్షేమ రంగానికి సంబంధించినవని నాయకులు గుర్తించాలని ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?