– బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు
కామారెడ్డి ప్రతినిధి:
నసురుల్లాబాద్ ( బాన్సువాడ): మండల కేంద్రంలో ఆదివారం రోజు బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి స్వామి వివేకానంద జయంతి ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సింగం సాయిలు మాట్లాడుతూ స్వామి వివేకానందుడు యువతకు ఎంతో ఆదర్శ ప్రాణంగా నిలిచారని కొనియాడారు. ఆయన రచించిన సూక్తులను ఎంతోమంది యువకులు ఆదర్శంగా తీసుకొని సమాజసేవలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అనుసూరి శ్రీనివాసరావు, అరిగె నారాయణ, యాదగిరి గౌడ్, గంగాధర్ గుప్తా, కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, శేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..