అప్రమత్తతే ప్రాణరక్షణకు తొలి అడుగు… ట్రాఫిక్ నియమాలే సురక్షిత ప్రయాణానికి బంగారు బాట.”
నిజామాబాద్, జూలై 9: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో **”ఇందూరు ట్రాఫిక్ యూత్ ఫోర్స్”**ను ఏర్పాటు చేశారు. సమాజ సేవలో యువతను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సుమారు 300 మంది సభ్యులతో ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ కిరణ్కుమార్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం సభ్యులు ట్రాఫిక్ భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు సూచనలు:
-
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
-
నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించాలి.
-
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.
-
ట్రాఫిక్ సంకేతాలు, నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలి.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








