👉“సిబ్బంది లేరంటు ఎంఆర్ఓ వాదన… నేలపై కనిపించని తనిఖీలు!”
👉“సిబ్బంది కొరతే కారణమా? లేక నిర్లక్ష్యమా?”
👉“రాత్రి–పగలు దర్జాగా సాగుతున్న ఇసుక రవాణా… నియంత్రణ ఎక్కడ?”
👉“ఫోన్ లిఫ్ట్ చేయని అధికారులు… ప్రజల ఫిర్యాదులకు స్పందన ఎక్కడ?”
👉“సాలూరు ఎంఆర్ఓ వ్యాఖ్యలపై వివాదం… పై అధికారుల జోక్యం అవసరం”

సాలూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనిఖీల కోసం సిబ్బందిని ఏర్పాటు చేశామని ఎంఆర్ఓ (తహసీల్దార్) పేర్కొన్నప్పటికీ, ప్రాక్టికల్గా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెక్పోస్టులు సహా కీలక ప్రాంతాల్లో తనిఖీ సిబ్బంది కనిపించకపోవడంతో, రాత్రి మాత్రమే కాకుండా పగలు కూడా అక్రమ ఇసుక రవాణా నిర్బంధం లేకుండా సాగుతోందని ప్రజలు చెబుతున్నారు. ఈ పరిస్థితి అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

ఈ విషయంపై ప్రశ్నించగా, “సిబ్బంది కొరత ఉంది. ఈ అంశాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం” అని అధికారులు సమాధానం ఇస్తున్నారని సమాచారం. అయితే, ఒకవైపు సిబ్బంది ఉన్నారని చెప్పడం, మరోవైపు కొరత ఉందని చెప్పడం పరస్పర విరుద్ధంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.
అదేవిధంగా, అక్రమ రవాణాపై సమాచారం అందించేందుకు ప్రజలు ఫోన్ ద్వారా సంప్రదించినా, అధికారులు స్పందించకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో సాలూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత అధికారుల పనితీరుపై పర్యవేక్షణ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







