May 28, 2026 2:50 am

V1News Telangana

Breaking :- “రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలి”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేరళం ముఖ్యమంత్రి ఘాటు లేఖ

హైద్రాబాద్ న్యూస్ డెస్క్:- ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ముదిరింది. కేరళ ప్రభుత్వ పనితీరుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు స్పందిస్తూ, కేరళం సీఎం పినరయి విజయన్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
రాజకీయ విబేధాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన రేవంత్‌కు హితవు పలికారు.

అభివృద్ధిలో కేరళ అగ్రస్థానం..

  • నీతి ఆయోగ్ విడుదల చేసిన SDG ఇండెక్స్ 2023-24లో 79 పాయింట్లతో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ 6వ స్థానంలో ఉందని విజయన్ గుర్తు చేశారు. కేరళ సాధించిన ఈ విజయాలు దశాబ్దాలుగా ఎల్.డీ.ఎఫ్ (LDF) ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే సాధ్యమయ్యాయని, ఇందులో కాంగ్రెస్ గొప్పదనం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

అవినీతిపై విమర్శలు..

  • నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం.. భారతదేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని విజయన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ 6వ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా ఉందని ఆయన ఎత్తిచూపారు.

పేదరిక నిర్మూలనలో రికార్డు..

  • నవంబర్ 1, 2025 నాటికి అత్యంత పేదరికం (Extreme Poverty) లేని ఏకైక రాష్ట్రంగా కేరళ అవతరించిందని విజయన్ గర్వంగా ప్రకటించారు. 64,006 కుటుంబాలను గుర్తించి, వారికి ప్రత్యేక మైక్రో-ప్లాన్ల ద్వారా ఉపాధి, ఆసరా కల్పించామని వివరించారు.

ఐటీ, పారిశ్రామిక వృద్ధి..

  • కేరళ తన 2026 ఐటీ పాలసీ ద్వారా భారత ఐటీ ఎగుమతుల్లో 10% వాటాను లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం (Vizhinjam Port) ద్వారా కేరళ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కేరళ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందని, పారిశ్రామిక స్తబ్దత ఉందన్న రేవంత్ వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపారేశారు.

కేంద్రంపై పోరాటం..

  • బీజేపీతో తాను మెతకగా ఉంటున్నానన్న ఆరోపణలను విజయన్ తిరస్కరించారు. కేంద్రం అనుసరిస్తున్న సమాఖ్య వ్యతిరేక విధానాలపై సుప్రీంకోర్టులో రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నది కేరళ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. మైనారిటీల హక్కుల కోసం, రాజ్యాంగ విలువల కోసం తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు.

కాంగ్రెస్‌పై విమర్శలు..

  • గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేరళకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో మొండిచేయి చూపిందని, కొచ్చి మెట్రో వంటి ప్రాజెక్టులను ఆలస్యం చేసిందని విజయన్ ఆరోపించారు. లేఖ చివరలో విజయన్ మలయాళంలో ఒక శక్తివంతమైన వ్యాఖ్య చేశారు. “మేము ముందుకు వెళ్తాము.. కేవలం ముందడుగు మాత్రమే వేస్తాం. ‘నవ కేరళ’ నిర్మాణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తాం. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలని, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని రేవంత్ రెడ్డికి పినరయి విజయన్ ఈ లేఖ ద్వారా స్పష్టమైన హెచ్చరిక పంపారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more