ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ – పోలీస్ కమీషనర్ శ్రద్ధ..
నిజామాబాద్: నగరంలోని ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. గారు ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు మరియు కూలింగ్ స్టోరేజీ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం పోలీస్ క్యాంపు కార్యాలయంలో రవీంద్ర ఫార్మసి మెడికల్ ఏజెన్సీ సహకారంతో నిర్వహించబడింది. పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, ఎండ తీవ్రత వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కంటి అద్దాలు వాడుకోవాలని, ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగాలని సూచించారు. అదనంగా, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి శ్రీ నారాయణ, CI శ్రీ ప్రసాద్, రవీంద్ర ఫార్మసి అధ్యక్షుడు శ్రీ మధుసూదన్, జనరల్ సెక్రటరీ శ్రీ సుధాకర్, ట్రేజరర్ శ్రీ సాయిలు సహా ట్రాఫిక్ SIలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








