Post Views: 199
జనసంద్రంలా మారిన రామగుండం – అంగరంగ వైభవంగా దసరా & దీపావళి వేడుకలు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం అక్టోబర్ 20
రామగుండం స్టేడియంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు దూదిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్మన్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, INTUC నాయకుడు జనక్ ప్రసాద్, జాతీయ SC కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు అలీ, శివరెడ్డి, సాగర్, గీత మాధురి తదితరులు వినోదం పంచారు. NTPC, సింగరేణి, మున్సిపల్, RFCL సంస్థల సౌజన్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది ప్రజలు పాల్గొని ఆనందం పంచుకున్నారు

.
Author: RAKESH NAMANI STAFF REPORTER
STAFF REPORTER RAMAGUNDAM








