V1News Telangana

మోతాదుకు మించి నల్లమట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులకు పట్టింపు లేదా? అంతర్గం మురుమూరు నల్ల మట్టి ఎటు పోతుంది మట్టి తరలింపు ఏ నాయకుడు పర్మిషన్ ఇచ్చారో ? బహిరంగ అమ్ముకుంటున్న మట్టిని మని తో కప్పుతున్న మ్యాటర్ ? ప్రాభుత్వం ఫ్రీ ఇచ్చిన లోడింగ్ లో పైసలు బరబర్ కట్టాల్సిందే ? ఒక లోడ్ కు 4 వేల నుండి 8 వేల వరకు వసూలు బహిర్గతం ఇన పైసలు ఇస్తూ మేనేజ్ చేస్తున్న వ్యాన్యం ?

మోతాదుకు మించి నల్లమట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులకు పట్టింపు లేదా?

అంతర్గం మురుమూరు నల్ల మట్టి ఎటు పోతుంది మట్టి తరలింపు ఏ నాయకుడు పర్మిషన్ ఇచ్చారో ?

బహిరంగ అమ్ముకుంటున్న మట్టిని మని తో కప్పుతున్న మ్యాటర్ ?

ప్రాభుత్వం ఫ్రీ ఇచ్చిన లోడింగ్ లో పైసలు బరబర్ కట్టాల్సిందే ?

ఒక లోడ్ కు 4 వేల నుండి 8 వేల వరకు వసూలు బహిర్గతం ఇన పైసలు ఇస్తూ మేనేజ్ చేస్తున్న వ్యాన్యం ?

 

 

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 20:-

అంతర్గాం మండలం ముర్ మూర్ లో పైపై అనుమతులు తీసుకొని రోజుకు లక్షల రూపాయల నల్ల మట్టి తరలిస్తున్నారని అనేక ఆరోపణలు ఈ మధ్య సోషల్ మీడియా వేదికాక మరియు ఇతర పత్రికలలో వస్తున్నప్పటికీ రామగుండం బాస్ ఏ మాత్రం పట్టించుకోకపోవడం అనే ప్రశ్నలకు దారి తీస్తుంది. అంతర్గం మండలంలోని అధికారులకు ఇతర నాయకులకు కొంతవరకు ముట్టినట్లు విశ్లేషనియా వర్గాల సమాచారం. మోతాదుకు మించి నల్ల మట్టి తవ్వకాలు జరుగుతున్న ఏ అధికారి చర్యలు తీసుకోకపోవడం కనీసం వాటి వైపు చూడకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ నల్ల మట్టి దందా కథ వెనక ఎవరెవరి హస్తం ఉందో తెలియాలి అని ప్రజలలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న అపోజిషన్ అనేక ఆరోపణలు చేసినప్పటికీ ఏ అధికారి కూడా అటువైపు చూడకపోవడం మరో ప్రశ్న రోజుకు వందలలో లారీలు మట్టిని ఎటు తీసుకు వెళుతుంది అది ఎవరికి చేరుతుందని అనేది ప్రజలలో అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. అంతర్గం మండలం రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు చూడడానికి కూడా భయపడుతున్నారని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంత మట్టిని ఏ పనికోసం వాడుతున్నారు రోజూ తలరిస్తున్న మట్టి ఎటు పోతుంది అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపేందుకు ఒక్క అధికారి కూడా ఈ మట్టి నిల్వలు వద్ద లేకపోవడం విడ్డూరమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతం లో అధికారం లో ఉన్న నాయకుల మీద ఎన్నో ఆరోపణలు వేసి మరి వీరు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నలు కూడా చాలా వినపడుతున్నాయి. జిల్లా కలెక్టర్ మట్టి మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతో తీసుకువెళ్లాలని చెప్తే ఏకంగా నల్ల మట్టినే మాయం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న వందల ఇటుక బట్టిలకు అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమ్ముకుంటున్న మట్టిపై ఏ అధికారి ఏమీ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే అని ఎదురుచూస్తున్న ప్రజానీకం. ఇక్కడ ఏ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడం ఇష్టానుసారంగా మట్టిని తీయటం తీసిన లోడింగ్ కి పైసలు వసూలు చేస్తూ రోజు లక్షల్లో చేతులు మారుతున్న కనీసం చర్య లేకపోవడం విడ్డూరమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మురుమూరు మట్టి తీసుకు వెళ్తున్న లారీ ఢీకొని ఒక వ్యక్తి మరణించారు దానికి ఏ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకం ప్రమాదానికి గురైన వ్యక్తికి న్యాయం చేయాలని అంతర్గం మండలం ప్రజలు మరణించిన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రోజు వందలాది లారీలు వస్తూపోతున్నప్పటికీ అటువైపు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు , జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు మరియు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post