ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి
బోధన్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు శనివారం, అంబేద్కర్ చౌరస్తా లో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మోమోరండం అందించారు.
ఈ సందర్భంగా, పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా ? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా అని మండిపడ్డారు
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీశ్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతుందని అన్నారు.
తక్షణమే జగదీశ్ రెడ్డి, పై ండ్ చేశారుసస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఇకనైనా సస్పెండ్ ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRS పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, నాయకులు నక్క లింగారెడ్డి, బెంజేర్ గంగారాం,రవిశంకర్ గౌడ్,శంకర్ గౌడ్,ప్రవీణ్ నాయక్,NRI అహమ్మద్,సాగర్, నసీర్ పటేల్, సాయిలు,md ఇంతియాజ్ పటేల్,సుధాకర్, ఆశీమ్,మహమ్మద్,తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....