బైంసా మండలం దేగాం గ్రామం, ముధోల్ మండలం తరోడ గ్రామం, బొరిగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేయబడింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. టెక్నాలజీ వినియోగాన్ని నియంత్రించి, కష్టపడటానికి బదులుగా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజా ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....