“ప్రజల సమస్యలే పాలనకు అద్దం… వాటి పరిష్కారమే మంచి పరిపాలనకు నిదర్శనం.”
బోధన్, జూలై 6: నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజనల్ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 9 వినతులు అందాయి. వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను అధికారులు స్వీకరించి, సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణిలో వ్యవసాయ పొలాలకు సాగునీటి సరఫరా, పట్టాదారు పాస్బుక్లో పేర్ల సవరణ, ఉపాధి కల్పన, అక్రమ నిర్మాణాలపై చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్కు సంబంధించిన తప్పుడు ప్రతిపాదనలపై ఫిర్యాదులు, ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు, ఇంటింటా చెత్త సేకరణలో ఫీజుల వసూళ్లపై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తనిఖీలు నిర్వహించాలనే అంశాలపై వినతులు అందాయి.
వినతులను స్వీకరించిన అధికారులు ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖలకు పంపించి, అర్హత, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







