June 16, 2026 12:06 am

V1News Telangana

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: బీజేపీ నాయకులు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఎమ్మార్వో కార్యాలయంలో సమావేశం – సాగునీరు, పంట నష్టపరిహారం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ..

బోధన్, జూన్ 15 (వార్త):
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం బీజేపీ నాయకులు సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టాలని, సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని, ప్రకృతి విపత్తులు మరియు ఇతర కారణాలతో పంట నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రైతుల సంక్షేమమే ఏ ప్రభుత్వానికైనా ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డీ మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు అడ్లూరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రాంచందర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీధర్, బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్, పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more