Post Views: 94
గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం
సోషల్ మీడియా కంటెంట్తోనే ఎక్కువ నష్టం అని అధ్యయనం
భారతీయ యువతపై ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ పరిశోధన
83 శాతం మందిలో మానసిక, శారీరక సమస్యలు
నిరంతర స్క్రీన్ మార్పులే కళ్లపై ఒత్తిడికి కారణం
మీరు స్మార్ట్ఫోన్లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే మీ కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. కేవలం గంటపాటు స్మార్ట్ఫోన్లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల కళ్లు తీవ్రమైన అలసటకు గురవుతాయని పరిశోధకులు తేల్చారు. ఫోన్ను ఎంత సేపు వాడామన్నదే కాదు, దానిలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని ఈ పరిశోధన స్పష్టం చేసింది.
ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన వివరాలు ‘జర్నల్ ఆఫ్ ఐ మూవ్మెంట్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు చదవడం లేదా వీడియోలు చూడటంతో పోలిస్తే, సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నప్పుడు మన కంటి పాపలో ఎక్కువ మార్పులు చోటుచేసుకుంటాయని
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








