. బోధన్ మారుతి మందిరంలో బ్రహ్మోత్సవాల హర్షోల్లాసం..
అంజయ్య స్వామికి పూజలు, హనుమాన్ భక్తుల సాంఘిక సమావేశం..
. రేపు చిరంజీవి స్వామి జన్మోత్సవం – విశేష కార్యక్రమాలు సిద్ధం..
. భక్తుల రక్షణకు వైద్య సదుపాయాలు, ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు..
శ్రీ మారుతి స్వామి దేవాలయం – బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇవాళ రెండవ రోజు సందర్భంగా అంజయ్య స్వామికి విశిష్ట పూజలు, అభిషేకాలు, ఆకు పూజ, ఆరతులు నిర్వహించబడ్డాయి. అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది.
ఈ పూజా కార్యక్రమంలో అనేకమంది హనుమాన్ భక్తులు, స్వాములు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
రేపు మూడవ రోజు బ్రహ్మోత్సవం సందర్భంగా, చిరంజీవి స్వామి జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ, ధ్వజ ఆవిష్కరణ, పూర్ణకుంభ ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం మూలవిరాట్ స్వామికి చీరాభిషేకం, రసాలలతో అభిషేకం, వస్త్రాలంకరణ, తామ్ర అలంకరణ వంటి పూజలు నిర్వహిస్తారు. జన్మోత్సవ సందర్భంగా మంగళహారతులు, ఆశీర్వచనాలు, శిష్టప్రసాదాల పంపిణీ జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు రామనామ హోమం జరగనుంది. ఇది లోక కళ్యాణం కోసం, ప్రశ్ని సంవత్సరం పురస్కరించుకుని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..
భక్తుల కొరకు:తాగునీరు, విశ్రాంతి గదులు
వైద్య సదుపాయాలు..
ఆలయ కమిటీ పర్యవేక్షణలో సమగ్ర ఏర్పాట్లు..

ఆహ్వానం:
భక్తులందరూ విచేసి స్వామివారి కృపకు పాత్రులవ్వగలరు.
– ఆలయ నిర్వాహకులు ప్రవీణ్ మహారాజ్, దేవాదాయ శాఖ ఆధ్వర్యం

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....