V1 న్యూస్ తెలంగాణ కథనానికి అధికారుల స్పందన
పుణ్య స్థానాలకు గోదావరిలో మురికి నీళ్లే గత అనే కథనానికి అధికారుల స్పందన
మున్సిపల్ అధికారులకు మరియు రామగుండం ఎమ్మెల్యే కు అభినందనలు తెలిపిన ప్రజలు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 26:-
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో v1 న్యూస్ తెలంగాణ కథనానికి అధికారుల స్పందన. గోదావరి నది ప్రాంతంలో సరైన వసతులు మరియు పుణ్య స్థానాలకి మురికి నీళ్లే గత అనే కథనానికి అధికారులు స్పందించి ప్రజలకు వసతులు కల్పించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. V1 న్యూస్ తెలంగాణ ఎప్పుడు ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని ప్రజలకు మరియు అధికారులకు వారధిగా నిలుస్తుందని పలువురు ప్రజలు అభినందనలు తెలియజేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అధికారులతో మాట్లాడి దాదాపు 250 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి డ్యాం నుంచి విడుదల చేపించి ప్రజలకు పుణ్యస్నానాలకు ఏర్పాటు చేశారు దీనికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నిరంతరం అభివృద్ధి దిశగా నడిచే రామగుండం మున్సిపల్ అధికారులు మరియు నాయకులు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. V1 న్యూస్ కథనానికి స్పందించి ప్రజలకు వసతులు కల్పించినందుకు మున్సిపల్ అధికారులకు మరియు ఎమ్మెల్యే v1 న్యూస్ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM