– జాతీయ పతాక ఆవిష్కరణ
– పాల్గొన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణి
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని కామ్ షేట్ పల్లి గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజు అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగానే గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన నిర్వహించుకుంటున్నామని అన్నారు. వారి యొక్క పోరాట ఫలితంగానే భారతీయ ప్రజలందరూ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ సమానత్వలతో జీవిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా త్యాగదనులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..