Post Views: 83
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్లుమింగ్ బర్డ్స్ పాఠశాలలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫయాజ్ అలీ మరియు ఇంచార్జి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
రమజాన్ నెల పవిత్రతను గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజంలో సౌహార్ద్రత, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల స్టాఫ్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist







