రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం గ్రామం మీదుగా పట్టపగలు సాయంత్రం రాత్రివేళ ఇష్టానుసారం ఇసుకతో నిండిన ట్రాక్టర్లు వెళ్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు అంబం గ్రామం మీదుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వెళ్తున్నాయి. సాయంత్రం మరియు రాత్రివేళ అక్రమ ఇసుక ట్రాక్టర్ లు నడుస్తున్నయి మరి అటువైపు అధికారులు నిఘా పడకపోవడం సిగ్గుచేటని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అయ్యా రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు అక్రమ ఇసుక తరిలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం మీ కర్తవ్యం కాదా, అక్రమ రవాణా అరికట్టడానికి కదా ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది అన్నట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు.అక్రమ రావణాలు జరుగుతున్న మీరు మౌనం పాటించడం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నిద్రలేచి రుద్రూర్ మండల కేంద్రంలో అక్రమంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ల పైన ఉక్కు పాదం మోపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist