మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి రాత్రి సమయం లో జీరో ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని స్థానిక ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. పోతంగల్, కోటగిరి ప్రాంతాల్లో డాంపులు మరియు హున్సా మందార్నా ప్రాంతాల నుంచి సాలూర చెక్ పోస్ట్ సరిహద్దు దాటి బోధన్ లోని ఇసుక మాఫియా మరెంత బలపడుతుంది. కొన్ని చోట్ల ధాబాలో సిట్టింగలు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం లాంటి అక్రమ అవినీతి మార్గాలతో ఇసుక రవాణా జరుగుతుంది. మరి ఇంత అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు వాహనాలను పట్టుకున్న ఈ అక్రమా రవాణా ఎందుకు ఆగడం లేదు విరికి తగిన శిక్ష దొరకకపోవాడం వలనే మళ్ళీ మళ్ళీ అక్రమ ఇసుక రావణకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అక్రమ రవాణా చేస్తున వారి పై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist







