ఆసుపత్రికి కావలసిన బేసిక్ పర్మిషన్లను తీసుకొని, దానిని ఆసరాగా చేసుకుని, తమ ఇష్టానుసారంగా అన్ని వసతులను కార్పొరేట్ స్థాయిలో కల్పిస్తున్నామంటూ అనుమతులు లేకున్నా, వైద్యం అందిస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలలో చోటు చేసుకుంటుంది…
ఇక వివరాలు కి వెళితే… ఇందల్వాయి మండలంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గైనకాలజీ సేవలు, జనరల్ మెడిసిన్ సేవలు, చిన్నపిల్లలకు సంబంధించిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ వైద్యం,
ఐ సీ యూ, దీనితోపాటు జనరల్ సర్జరీలు కూడా చేస్తామని….
ఏకంగా ఆస్పత్రి ఎదుట బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు.
తీరా వివరాల్లోకి వెళ్లి చూడగా… ఆసుపత్రికి సంబంధించి కేవలం బేసిక్ స్థాయిలో వైద్యం అందిస్తామంటూ… జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ లో అనుమతులు తీసుకొని, ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ని నడుపుతున్నారు…
ఇంతే కాకుండా డాక్టర్ స్రవంతి, శ్రీ వైద్య నిపుణులు అక్కడ పనిచేస్తున్నారని బోర్డులను పెట్టుకుని,
వచ్చిన పేషంట్లకు మాత్రం ఆసుపత్రిలో ఎంబిబిఎస్ డాక్టర్ వైద్య సేవలను అందిస్తూ సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు….

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....