V1News Telangana

Sugar Exports: అక్టోబర్ 31 తర్వాత కూడా చక్కెర ఎగుమతులపై ఆంక్షలు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం..

 

Sugar Exports: నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న ధరలను తగ్గించడానికి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 అక్టోబర్ 31 తర్వాత కూడా చక్కెర ఎగుమతులపై ఆంక్షలు కొనసాగించాలని భావిస్తోంది. డొమెస్టిక్‌ మార్కెట్, ధరల స్థిరత్వాన్ని నిర్ధారించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంది.
* ఎగుమతి ఆంక్షల పొడిగింపు
చక్కెర ఎగుమతులపై ఆంక్షల పొడిగింపును ధృవీకరిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఇటీవల ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరిమితులు ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర, సేంద్రీయ చక్కెర సహా అన్ని రకాల చక్కెరలకు వర్తిస్తాయి. ఇవన్నీ HS కోడ్‌లు 1701 14 90, 17019990 కిందకు వస్తాయి.
ఈ పరిమితుల పొడిగింపు ఫారిన్‌ ట్రేడ్( డెవలప్‌మెంట్ & రెగ్యులేషన్) చట్టం, 1992 లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ పరిధిలోకి వస్తుంది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ అయిన DGFT, ఎగుమతి పరిమితులను అమలు చేయడానికి, కొనసాగించడానికి ఈ చట్టం కింద తన అధికారాన్ని వినియోగించుకుంటుంది.

అల్లు అర్జున్ సహా జాతీయ అవార్డు గ్రహీతలు..

అల్లు అర్జున్ సహా జాతీయ అవార్డు గ్రహీతలు..

* ఎగుమతులపై ప్రభావం
చక్కెర ఎగుమతి పరిమితుల పొడిగింపు అనేది నిత్యావసర వస్తువుల ధరలను మెయింటైన్‌ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న కీలక చర్యల్లో భాగం. ముఖ్యంగా దేశీయ విపణిలో ఈ కీలక వస్తువు లభ్యతను నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం మునుపటి సంవత్సరం జూన్‌లో చక్కెర ఎగుమతులపై పరిమితులను ప్రవేశపెట్టింది. 2023 సెప్టెంబరు 30న ముగిసిన ఇటీవల సీజన్‌లో, చక్కెర మిల్లులు 6.1 మిలియన్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతి పొందాయి. ఇది మునుపటి సీజన్‌లో ఎగుమతి చేసిన 11.1 మిలియన్ టన్నులతో పోలిస్తే చాలా తక్కువ.
* ఈయూ, యూఎస్‌కి మినహాయింపులు
చక్కెర ఎగుమతి పరిమితుల ఇటీవలి పొడిగింపు యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ (US) కోసం ఉద్దేశించిన చక్కెర సరుకులకు వర్తించదు. ఈ మినహాయింపు భారత ఎగుమతిదారులకు ఈ ప్రాంతాలతో వాణిజ్యాన్ని కొనసాగించడానికి, దౌత్య, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది.
* ప్రభుత్వ ద్రవ్యోల్బణ నియంత్రణ ప్రయత్నాలు
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సహా వివిధ వనరుల నుంచి ఉత్పన్నమయ్యే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి రూపొందించిన అనేక చర్యలను అమలు చేయడంలో భారత ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. చక్కెర, ఇతర నిత్యావసర వస్తువుల ఎగుమతిని పరిమితం చేయడం ద్వారా, దేశీయ మార్కెట్‌లో ఈ వస్తువుల స్థిరమైన సరఫరాను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో వేగంగా ధరలు పెరగడం, తగ్గడం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post