సాలూర చెక్పోస్ట్ వద్ద రాత్రి నిర్లక్ష్యం..? సీసీ కెమెరాలు ఆఫ్ అన్న ఆరోపణలు..

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని సాలూర చెక్పోస్ట్ వద్ద రాత్రి సమయంలో నిర్లక్ష్యం నెలకొన్నట్లు కనిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన చిత్రాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఒక ఫోటోలో చెక్పోస్ట్ వద్ద వాహనాలు వెళ్లిపోతున్నా, కౌంటర్ వద్ద ఎలాంటి సిబ్బంది కనిపించకపోవడం గమనార్హం. మరో ఫోటోలో చెక్పోస్ట్ కార్యాలయం వెలుతురు ఉన్నప్పటికీ, అక్కడ విధుల్లో ఎవరూ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

స్థానికుల ఆరోపణల ప్రకారం, ఇదే సమయంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని, ఆ సమయంలోనే సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్నారు.
👉 దీంతో అక్రమ ఇసుక రవాణాకు మరింత సులభంగా మారుతోందని ప్రజలు అంటున్నారు.
అలాగే అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. వాస్తవ పరిస్థితి ఏమిటి? సీసీ కెమెరాలు నిజంగా ఆఫ్ అవుతున్నాయా? అనే విషయంపై సంబంధిత శాఖలు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







