Post Views: 451
బోధన్ నియోజకవర్గంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి “గో బ్యాక్” అంటూ నినాదాలు చేస్తూ సంఘటన చోటు చేసుకున్నారు.
స్థానిక ప్రజల ఫిర్యాదు ప్రకారం, పార్టీ నాయకులు సభ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేను నిరసన సూచనగా ఎదిరించారని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే బోధన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా, ఆందోళనలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల వల్ల ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు..
రాజకీయ వర్గాలు ఈ సంఘటనను గమనిస్తూ, భవిష్యత్తులో స్థానిక ఎన్నికలకు ప్రభావం ఉంటుందేమో అని అంచనా వేస్తునరు.
Author: IRFAN Reporter
Work from as a journalist








