V1News Telangana

ప్రజావాణి కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ – న్యాయ పరిష్కారానికి కమీషనర్ సాయిచైతన్య దిశానిర్దేశం..

నిజామాబాద్, జూలై 7 (ప్రత్యేక ప్రతినిధి):
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీసు సేవలు మరింత సమీపంగా అందించేందుకు రూపొందించిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిరంతర కొనసాగింపుగా విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసు కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., స్వయంగా హాజరై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 27 ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు.

కమీషనర్ గారు ప్రతి ఫిర్యాదుదారుని వ్యక్తిగతంగా విని, సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత స్టేషన్ల ఎస్.ఐలు, సి.ఐలుతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సూచనలు జారీ చేశారు. ఫిర్యాదుల స్వీకరణ మాత్రమే కాకుండా, వాటికి చట్టబద్ధ పరిష్కారాలు తక్షణం అందేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా అధికారులు చురుగ్గా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించేందుకు, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రజలు నేరుగా తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రజావాణి ఒక మంచి వేదికగా నిలుస్తోంది. ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించుకుంటూ ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరిస్తున్నాము” అని పేర్కొన్నారు.

అలాగే ప్రజలు భయాందోళనలు లేకుండా, నిబంధనల ప్రకారం సమస్యలను పోలీసు వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేలా వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post