“రైతులకు నిండా నీరు కాదు – అధికారుల మొండితనం నిండా!””
పంట కాలువలు ఖాళీ చేయండి – ప్రజల కాపలాదారులు మేలుకోండి!”బడి పిల్లలకీ లేదు ఈ డ్రైనేజ్ దుస్థితి – గ్రామస్తుల బ్రతుకులమీద మాఫియా పట్టు!””పెద్దల దౌర్జన్యం – చిన్నవాళ్లపై నోటీసులు!”
సాలూరు (నిజామాబాద్ జిల్లా):
రైతులకు నీటి హక్కు లేదు.. మాఫియాలకు భూమి హక్కు ఉంది! ఇదే పరిస్థితి ఇప్పుడు సాలూరు మండలంలో. బస్టాండ్ పక్కనే ఉన్న పంట కాలువలు మఫీగా మారాయి. రైతులకు జీవనాధారమైన సాగునీటి కాలువలపై బడా బాబులు కళ్ళు పడ్డాయి. అక్రమంగా గోడలు కట్టేశారు, షాపులు తిప్పుతున్నారు. కొందరైతే రెంటుకూ ఇచ్చి వసూళ్లు చేస్తున్నారు.
ప్రజలు ప్రశ్నిస్తున్నారు
▶ చట్టాలు సామాన్యులకు మాత్రమేనా?
▶ మాఫియా ముందు ప్రభుత్వ యంత్రాంగం లొంగిపోతుందా?
▶ రైతుల హక్కులకు రక్షణ లేనిదేనా?
కనీసం డ్రైనేజ్ మార్గాలు సైతం మూసుకుపోయి, దుర్వాసనతో ప్రజలు బాధపడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి ఊహించలేనిదిగా మారనుంది.
ఘాటు ప్రశ్నలు – ప్రభుత్వానికి మేలుకోమంటున్నాయి:
ఈ ఆక్రమణల వెనుక ఎవరి పట్టు?
ప్రజల రక్తవేదనపై స్పందించని అధికారులు ఇంకా పదవుల్లో ఎందుకు?
ఇకనైనా మేలుకోండి – కాలువలు రైతులవి, మాఫియాకావు!
ఈ ఉద్యమం ప్రజల శ్వాస కోసం… రైతుల హక్కుల కోసం… న్యాయానికి దిక్సూచి కావాలి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....