V1News Telangana

భైంసాలో తిరంగా యాత్ర – జాతిపతాక పట్ల గౌరవానికి ప్రతీక….

భైంసా, మే 19:దేశభక్తి, ఐక్యత, పౌరత్వ స్ఫూర్తికి ప్రతీకగా మే 20 మంగళవారం ఉదయం 10 గంటలకు భైంసాలో ఘనంగా తిరంగా యాత్ర జరగనుంది. వెంకటేశ్వర టెంపుల్ వద్ద ప్రారంభమయ్యే ఈ జాతర తిరంగా యాత్ర, బాలాజీ టెంపుల్ నుండి అంబేద్కర్ విగ్రహం బస్టాండ్ వరకు సాగనుంది.

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అపార త్యాగాలతో పోరాడుతున్న భారత సైనికుల పట్ల సంఘీభావంగా నిర్వహించే ఈ యాత్రలో, రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. చిన్నా పెద్దా, యువత, మహిళలు వేలాదిమంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

ఈ యాత్రలో గౌరవనీయ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొననున్నారు. జాతీయ గౌరవానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

– అందరూ ఆహ్వానితులే

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post