Post Views: 139
మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు ఆటో లో మర్చిపోయిన నగదు అందజేత ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం మే 04:-
ప్రజల సౌకర్యార్థంలో ట్రాఫిక్ పోలీసులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని మరోసారి నిరూపించుకున్నారు. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండం నుండి గోదావరిఖని ఆర్టిసి బస్టాండ్ కు పెసరి సునీత అనే దంపతులు ఆటోలో ఆదివారం రోజున బయలుదేరి బస్టాండులో దిగిన సమయంలో తమ డబ్బుల బ్యాగును ఆటోలో మర్చిపోయారు . దీనితో దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించగా సీఐ రాజేశ్వర్ రావు తమ సిబ్బందితో కలిసి సిసి కెమెరాలలో కనుగొని ఆటోలో ఉన్న 30, 000 వేల రూపాయలు డబ్బులను ఇప్పించారు. ఈ మేరకు బాధితులు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, సిబ్బందికి కృత్ఞతలు తెలిపారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM