Post Views: 97
రామగుండంలో అంబేద్కర్ 134వ జయంతి ఘన సంబరం
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 14:-
రామగుండం ఏరియా-1లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని సింగరేణి యాజమాన్యం ఘనంగా జరిపింది. డిజిఎం కిరణ్ బాబు అధ్యక్షతన, శాసనసభ్యులు మక్కాన్ సింగ్, జిఎం లలిత్ కుమార్, శ్రీమతి అనితతో పాటు యస్.సి, యస్.టి నాయకులు హాజరయ్యారు. గోదావరిఖని నుండి జిఎం కార్యాలయం వరకు డప్పు, కోలాటంతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించారు. సభలో వక్తలు అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు, గీతాలు ఆకట్టుకున్నాయి. లలిత్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగ రచన, సమసమాజ స్థాపనలో కృషిని స్మరించారు. ఏరియా గనుల్లోనూ వేడుకలు జరిగాయి.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM