నిర్మల్, ఏప్రిల్ 14:
అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని, నిర్మల్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి జలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ కారణంగానే మన దేశం ఈ రోజు గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని” అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ఆయన వివరించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు అంబేద్కర్ను అవమానించే విధంగా ప్రవర్తించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితిష్ రాథోడ్, నాయకులు అయ్యనగారి భూమయ్య, జయంతి ఉత్సవాల జిల్లా కన్వీనర్ సాంవ్లీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....