అంతా నేనే అనే రౌడీషీటర్ అమానుషాలపై విచారణ జరిపించాలి..
హంగర్ఘ గ్రామ మహిళపై 20 ఏళ్లుగా దాసత్వం
హంగర్ఘ గ్రామానికి చెందిన ఓ మహిళను గత 20 సంవత్సరాలుగా తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి ఆమెను చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంబంధిత వ్యక్తి ఆమె వద్ద నుంచి లక్షల రూపాయలు దోచుకుని, భౌతికంగా, మానసికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇంకొక మహిళను టార్గెట్ చేస్తున్న దుశ్చర్య
ప్రస్తుతం రుద్రూర్ మండలానికి చెందిన మరో మహిళను టార్గెట్ చేస్తూ, రోజూ వీడియో కాల్స్ ద్వారా ఆమెను ప్రభావితం చేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత మహిళ కూడా మౌనంగా ఉండటంతో అనుమానాలు మరింత గాఢమవుతున్నాయి.
బ్లాక్మెయిల్, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తి
ఈ వ్యక్తి విలేకరితనం గురించి తెలియకుండానే తాను ఓ విలేకరి అనే ముసుగులో బ్లాక్మెయిల్, బెదిరింపులు చేస్తూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు ఆడియో, వీడియోలు, వాట్సాప్ సందేశాలు దీనికి నిదర్శనంగా మారుతున్నాయి.
అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి
పొతంగల్ మండల కేంద్రంలో జరిగిన ఈ దుశ్చర్యపై సంబంధిత అధికారులు, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళల జీవితాలను అణగదొక్కే ఇలాంటి చట్టవ్యతిరేక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని, న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....