– వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా మణులను ఘనంగా సత్కరించిన మాజీ ఎంపిటిసి
– ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్సై లావణ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి
– ఉన్నత విద్య, ఉద్యోగ రంగాలలో మహిళలు ముందున్నారని కితాబు
– స్త్రీ మూర్తులు లేనిదే సృష్టి లేదని ప్రశంసలు
– సతీసహగమనం నుండి విమానాలను నడిపే స్థాయికి ఎదగడం పట్ల సంతోషం వ్యక్తం
– మాజీ ఎంపిటిసి కందిమల్లేష్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మహిళల యొక్క ప్రాధాన్యతను, గొప్పతనాన్ని కీర్తిస్తూ వారికి తన సొంత నివాసం వద్ద సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లావణ్య మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై లావణ్య మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి లు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం పురుషాధిక్య సమాజంలో అణచివేతకు గురవుతూ గృహనిర్బంధం లో ఉన్నటువంటి మహిళలు నేటి సమాజంలో తమ బానిస సంకెళ్లను తెంచుకొని పురుషులతో పోటీ పడుతూ వారిని అధిగమిస్తూ ఉన్నత విద్య, ఉద్యోగ రంగాలు, విమానాలను సైతం నడుపుతూ రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా ప్రతి మహిళలు పట్టుదలతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అని సూచించారు. ఇప్పటికీ కొందరు మహిళలలో సంశయంతో ముందుకు ఎదగడం లేదని అటువంటివారు ఆలోచనలను, మానసికస్థైర్యాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థాయిలకు ఎదగాలని కోరుకున్నారు. ఇప్పటికీ కొన్నిచోట్ల స్త్రీలు అణచివేతకు, అఘాయిత్యాలకు గురవుతున్నారని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసుకు చాలా బాధ కలుగుతుందని విచారం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పునరావృతం కాకుండా ఉండాలంటే మహిళలు ధైర్యంగా ఉండాలని అదేవిధంగా ఆత్మరక్షణ విద్యలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. మహిళలు ఎక్కడైనా నిస్సహాయ స్థితిలో అణిచివేతకు గురవుతుంటే అటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లైతే వాటిని పరిష్కారం చేసి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మాట్లాడుతూ స్త్రీ యొక్క గొప్పదనం వర్ణించలేనిదని కొనియాడారు. వారు లేనిదే సృష్టి లేదని.. అలాంటి మహిళల ప్రాధాన్యతను, గొప్పతనాన్ని తెలుసుకొని వారికి సమాజంలో గౌరవ మర్యాదలు, స్వేచ్ఛను సముచిత స్థానాలను కల్పించినట్లయితే ఎంతో ఎత్తుకు ఎదుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పురాతన కాలంలో , అనాగరిక సంస్కృతిలో బాల్య వివాహాలు, సతీసహగమనం, వివస్త్రలుగా మార్చి రాక్షస ఆనందం పొందిన పరిస్థితులను అధిగమించి నేటి సమాజంలో పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాలలో తాము కూడా తీసిపోమని రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో ఓర్పు, సహనం, పట్టుదల , ఆగ్రహం అన్ని ఎక్కువగానే కలిగి ఉంటారని పరిస్థితులకు తగ్గట్టుగా వారి సభావాలను వినియోగిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళలు పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. అనంతరం పోటీలలో గుల్ పొందిన విజేతలకు బహుమతులు ప్రధానం వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి.. అభినందించి శుభాకాంక్షలు మహిళలందరూ పరస్పరం మిఠాయిలు పంచుకొని ఆత్మీయంగా ఆలింగణం చివరగా అందరూ కలిసి ఏర్పాటుచేసిన విందు భోజనం చేసి .. మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ, మర్యాదలతో తమను సత్కరించిన మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సౌజన్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి టీచర్లు గౌరమ్మ, గంగామణి, మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..