ఆరవై సంవత్సరాల లోపు ఉన్న పేద మహిళలందరూ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలి
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ఎఫ్ ఎ సి జె. అరుణ శ్రీ
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 24:-
రామగుండం ఏరియాలో పద్దెనిమిది నుండి ఆరవై సంవత్సరాల లోపు ఉన్న పేద మహిళలందరూ స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ఎఫ్ ఎ సి జె. అరుణ శ్రీ అన్నారు. ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్స్ లోని మహిళా స్వశక్తి భవన్ లో సోమవారం నిర్వహించిన రామగుండం పట్టణ మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు . ఈ సంధర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొత్త స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్వశక్తి మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు స్త్రీ నిధి . ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సబ్సిడీ రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఇందిరా మహిళా స్వశక్తి పథకం ద్వారా ఎక్కువ మంది స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకు లింకేజీ లక్ష్యo పెంచిన నేపధ్యంలో అర్హత ఉన్న స్వశక్తి మహిళలు రుణం పొంది సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్వశక్తి సంఘాల్లో , వార్డు సమాఖ్యల్లో నిర్ణీత కాల వ్యవధిలో నాయకత్వ మార్పిడి జరగాలని అన్నారు. బ్యాంకర్ల సహకారంతో వీధి వ్యాపారులకు పి ఎం స్వనిధి రుణాల పంపిణీ వెంటనే జరిగేలా చూడాలని అన్నారు. రామగుండం నగరం మెరుగైన ర్యాంక్ సాధించడానికి స్వచ్చ సర్వేక్షణ్ లో పౌర స్పందన పై ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది నమోదు చేసేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో మెప్మా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ సతీష్ , స్త్రీ నిధి మేనేజర్ రాజారావు , మెప్మా టి ఎం సి మౌనిక , రామగుండం పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లతా మోహన్ , కమ్యూనిటి ఆర్గానైజర్లు ఊర్మిళ , వార్డు సమాఖ్య ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM