V1News Telangana

దేవాదాయ శాఖ ఉద్యోగులా… రోజువారి కూలీలా …

– నసురుల్లాబాద్ లో దేవాదాయ శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఇంట్లో వ్యక్తిగత పనులు చేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగులు

– నిజామాబాద్ నుండి పిలిపించి వెట్టి చాకిరి చేయించుకుంటున్న వైనం

– ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులకు వివరణ కోరగా స్పందించని తీరు

– అధికార అండతో క్రింది స్థాయి ఉద్యోగులపై అజమాయిషి సాధిస్తున్న అధికారి

– అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగస్తులను దయ దాక్షిణ్యాలు లేకుండా తన స్వంత ఇంటి నిర్మాణం పనుల కొరకు దేవాదాయ శాఖ ఉన్నత అధికారి క్రింది స్థాయి ఉద్యోగులను కూలీలుగా మార్చి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఇడుపులపాటి శ్రీనివాస్ రావ్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి నిజామాబాద్ ఎండోమెంట్ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను దినసరి కూలీలుగా మార్చి తన ఇంటి వద్ద పనులకు గత మూడు నెలలుగా నిత్యం తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్నారని.. ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ఉద్యోగులను వివరణ కోరగా వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్న భయంతో మీడియా సమక్షంలో మాట్లాడడానికి ముఖం చాటేసారు. తన సొంత ఇంటి నిర్మాణ పనులకు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవడం కొరకు జిల్లా స్థాయి అధికారులను సైతం ఆయన భయభ్రాంతులకు గురి చేశారని అందువల్లనే క్రింది స్థాయి ఉద్యోగులు భయభ్రాంతులకు గురై వారికి ఎదురు చెప్పలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని దినసరి కూలీలుగా మారి పనిచేస్తున్నామని వాపోతున్నారు. ఆదివారం రోజు సెలవు దినం అయినప్పటికీ ఉద్యోగులకు సెలవు దినాన్ని కుటుంబ సభ్యులతో గడుపుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకోవడం పట్ల పలువురు విస్మయానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుండి వేతనాలు పొందుతూ ఉన్నతాధికారులకు వ్యక్తిగత సేవలు చేయడానికా క్రింది స్థాయి ఉద్యోగులను నియమించింది అని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా అధికారిని వివరణ కోరడానికి సంప్రదించగా అతను స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత శాఖ ఉన్నతాధికారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనియెడల క్రింది స్థాయి సిబ్బందిని తమ అధికార బలంతో పలు శాఖల ఉన్నతాధికారులు స్వంత అవసరాలకు వినియోగించుకునే ప్రమాదం ఉంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post