– నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు
– భవిష్యత్ కార్యాచరణ పై దిశానిర్దేశం
– అధిక సంఖ్యలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు
– బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవిత ఆదివారం రోజు బాన్సువాడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని .. తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. నసురుల్లాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, యువ నాయకులు టేకుర్ల సాయిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుంచు శేఖర్, దేశ్ పాక్ సాయిలు, అల్లం గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..