*సంక్రాంతికి సీఎం రేవంత్ వరాల జల్లులు !*
– కొత్త రేషన్ కార్డుల జారీ
– ఇందిరమ్మ ఇండ్ల పై ఫోకస్
– రైతు భరోసా కీలక ప్రకటన
– లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ,
రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తమకున్న సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సీఎంను ఆదివాసీ సంఘాలు కోరాయి. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా, సాగు, తాగునీటి సరఫరా లాంటి మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివాసీ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టినట్లు గుర్తుచేశారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించామని.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేసుకున్నామని తెలిపారు. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.
ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొమురం భీం వర్ధంతి, జయంతులను అధికారికంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించే అంశాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ను వెంటనే క్లియర్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....