V1News Telangana

June 20, 2024

డ్రైనేజీ వ్యవస్థ పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న ఎం.పీ.ఓ V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం పనులను బుధవారం రోజు పంచాయతీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను ఎంపీ ఓ రాము సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని కూలీలకు సూచించారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తా,చెదారం మరియు గుంపులుగా పెరిగిన చెట్లు అన్నింటిని తొలగించి గ్రామాన్ని శుభ్రం చేయడంలో సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, కారొబారి రతన్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.