V1News Telangana

హెచ్ ఆర్ ఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

మానవ హక్కుల వేదిక రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం గంగూలు, రమేష్ కు కోరారు. బోధన్ పట్టణంలోని పి ఆర్ టి యూ భవన్ లో హెచ్ ఆర్ ఎఫ్ 10 వ రాష్ర్ట మహాసభల కర పత్రాలను సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీలలో అనంతపురం జిల్లాలో మహా సభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలలో కులగణన ఎందుకు అవసరం, బస్తర్ మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎన్ ఈ పి 2020 – కషాయికరణ, కార్పొరేటికరణ అనే అంశాలపై సదస్సులో వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అహ్మద్, నాయకులు ధర్మయ్య, మారుతి, అరుణ్ కుమార్, పిట్ల లక్ష్మి, విశ్రాంత ఎం ఈ వో కందారే శంకర్, హుసాన్ తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?