V1News Telangana

హక్కుల హననానికి వ్యతిరేకంగా సంఘటితం కావాలి !

హక్కుల హననానికి వ్యతిరేకంగా సంఘటితం కావాలి !

గొర్రె పాటి మాధవరావు (మానవహక్కుల వేదిక పూర్వ రాష్ట్ర అధ్యక్షులు)

మానవ హక్కుల హననం ఏకోణంలో జరిగినా వాటికి వ్యతిరేకంగా సంఘటితం అయి ఉద్యమించాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర పూర్వ అధక్షులు, సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు గా గుర్తించిన జీవించే హక్కు, భావ ప్రకటన స్వీఛ్ఛ, నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో అపహాస్యం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ దార్శనికులు కలలు గన్న సమానత్వం, స్వేచ్ఛ, హక్కులు మసక బారుతున్నాయని పేర్కోన్నారు. రాజ్యాంగ లక్ష్యాలు సాధించాలని ప్రభుత్వాలు కర్తవ్యంగా గుర్తించడం లేదని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వాలు క్రూరంగా అణచి వేస్తున్నాయని, ఈ వైఖరి ప్రజస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని వివరించారు. తమ వేదిక హక్కుల రక్షణకు పోరాడుతుందని, ఈ ఉద్యమంలో మేధావులు, విద్యా వంతులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు

ఆదివారం బోధన్ పట్ట ణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి మీటింగ్ హాల్ లో మానవ హక్కుల వేదిక 7వ జిల్లా మహసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హజరై మాధవరావు మాట్లాడారు. జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సల్ప రమేష్, జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు, ప్రతినిధులు సరిత, అహ్మద్ అరుణ రేఖ, మీన సహాని, మారుతి, అరుణ్, నరేందర్, న్యాయవాదులు సంగం, రమేష్, అన్వేష్, శ్రీనివాస్, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post