బాన్సువాడలో మహా సహస్ర అవధాని గరికపాటి నరసింహారావ్ ప్రవచనాలు……
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: కార్తీక మాసమును పురస్కరించుకొని ప్రజలకు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మరియు భక్తి మార్గంలో పయనించే విధంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అయ్యప్ప సేవాసమితి నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మహా సహస్ర అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అందరికీ అర్థమయ్యే విధంగా హాస్యాన్ని పండిస్తూ మంచి విషయాలను ప్రవచనాల రూపంలో భక్తులకు వివరించారు. ఎంతో విలువైన సందేశాలను ఆయన ప్రవచనాల ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమానికి భారీగా పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..