Post Views: 63
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామానికి చెందిన కమ్మరి శివకుమార్ ,లావణ్య కుమార్తె రమ్యశ్రీ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యను అభ్యర్థిస్తుంది. గత రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా బుధవారం రోజు రమ్యశ్రీని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గాబాయి, వ్యాయామ శిక్షకుడు, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..